Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

ఆరోపణలపై చర్చకు సిద్ధం : మాజీ మంత్రి బాలినేని

కొత్త కేబినెట్‌లో వైసీపీ నేత బాలినేని శ్రీనివాసరెడ్డికి చోటు దక్కలేదన్న విషయం తెలిసిందే. తాజాగా ఆయన ఈ విషయంపై మాట్లాడారు. తాను మంత్రి పదవి రేసులో ఉన్న సమయంలో తనపై టీడీపీ నేతలు రూ.1,700 కోట్ల అవినీతికి పాల్పడ్డానంటూ ఆరోపణలు చేశారని, ఆ ఆరోపణలపై చర్చకు సిద్ధమని బాలినేని సవాలు విసిరారు. సీఎం వైఎస్‌ జగన్‌ ఆలోచనా పరుడని, ఎవరిని ఎలా వాడుకోవాలో ఆయనకు తెలుసని చెప్పారు. ఎవరి బెదిరింపులకో భయపడి మంత్రి పదవి ఇచ్చే వ్యక్తి కాదని అన్నారు. గతంలో కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీని కూడా జగన్‌ ఎదిరించారని అన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img