ఉగాది పండుగ వేళ విద్యుత్ ఛార్జీలను మరింత పెంచారని. గుడ్ ఫ్రైడేకి ఆర్టీసీ టికెట్ ధరలు పెంచారని టీడీపీ నేత దేవినేని ఉమా మహేశ్వరరావు అన్నారు. దేవినేని ఉమా మహేశ్వరరావు అమరావతిలోని గొల్లపూడి నుంచి మైలవరం వరకు ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు. ఈ సందర్భంగా బస్సులోని ప్రజలతో మాట్లాడి వారి కష్టాల గురించి అడిగి తెలుసుకున్నారు. జగన్ పాలనపై బస్సులోని ఉద్యోగులు, విద్యార్థులు, రైతులు, మహిళల అభిప్రాయాలు తెలుసుకున్నారు. మోసపూరిత సర్కారుకు ప్రజలు బుద్ధి చెప్పే రోజు దగ్గరలోనే ఉందని ఈ సందర్భంగా దేవినేని ఉమ అన్నారు.