Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

ఆర్టీసీ బస్సులో ప్రయాణించిన దేవినేని ఉమ

ఉగాది పండుగ వేళ విద్యుత్‌ ఛార్జీలను మరింత పెంచారని. గుడ్‌ ఫ్రైడేకి ఆర్టీసీ టికెట్‌ ధరలు పెంచారని టీడీపీ నేత దేవినేని ఉమా మహేశ్వరరావు అన్నారు. దేవినేని ఉమా మహేశ్వరరావు అమరావతిలోని గొల్లపూడి నుంచి మైలవరం వరకు ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు. ఈ సందర్భంగా బస్సులోని ప్రజలతో మాట్లాడి వారి కష్టాల గురించి అడిగి తెలుసుకున్నారు. జగన్‌ పాలనపై బస్సులోని ఉద్యోగులు, విద్యార్థులు, రైతులు, మహిళల అభిప్రాయాలు తెలుసుకున్నారు. మోసపూరిత సర్కారుకు ప్రజలు బుద్ధి చెప్పే రోజు దగ్గరలోనే ఉందని ఈ సందర్భంగా దేవినేని ఉమ అన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img