Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

ఆర్థిక దివాళా పరిస్థితుల్లో ఏపీలో రాష్ట్రపతి పాలన అనివార్యం

ఎంపీ రఘురామకృష్ణంరాజు
ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్రపతి పాలన పెట్టాలని ఎంపీ రఘురామకృష్ణంరాజు లోక్‌సభలో కేంద్రాన్ని కోరారు. 377 నిబంధన కింద లోకసభలో లిఖితపూర్వకంగా కోరారు. ఏపీలో ఆర్థిక పరిస్థితి అస్తవ్యస్థంగా మారిందని, రుణాల కోసం ప్రభుత్వ ఆస్తులను తాకట్టు పెడుతున్నారని ఆరోపించారు. ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు కూడా చెల్లించలేని పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఉందన్నారు. . కార్పొరేషన్ల పేరుతో దొడ్డిదారిన రుణాలు తీసుకుంటున్నారని అన్నారు. ఆర్థిక దివాళా పరిస్థితుల్లో ఏపీలో రాష్ట్రపతి పాలన అనివార్యమని పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img