Wednesday, April 17, 2024
Wednesday, April 17, 2024

ఆ పెద్ద మునిషివి బురద రాజకీయాలు: సీఎం జగన్‌

టీడీపీ అధినేత చంద్రబాబువి బురద రాజకీయాలు చేస్తున్నారని సీఎం జగన్‌ మండిపడ్డారు. వరద బాధిత ప్రాంతాల్లో బాధితులను ఆదుకునేందుకు ఇంతటి శరవేంగా చర్యలను తీసుకోవడం అన్నది గతంలో ఎన్నడూ జరగలేదు. గతంలో కనీసం నెల పట్టేదని..ఇప్పుడు వారంరోజుల్లోనే బాధితులకు సహాయాన్ని అందించగలిగామని అన్నారు. బాధిత కుటుంబాలకు అన్నిరకాలుగా నష్టపరిహారాన్ని అందించామని అన్నారు. దురదృష్టవశాత్తూ ఎవరైనా మరణిస్తే వారి కుటుంబానికి పరిహారం ఇవ్వాలంటే నెలరోజులు పట్టేది..అలాంటిది వారంరోజుల్లో ఆయా కుటుంబాలకు పరిహారం ఇచ్చి వారిని అదుకుంటున్నట్లు చెప్పారు. ఇప్పుడు నష్టపోయిన రైతులకు యుద్ధప్రాతిపదికన ఎన్యుమరేషన్‌ పూర్తిచేసి.. సీజన్‌లోగా వారికి సహాయం అందిస్తున్నాం. గతంలో ఇన్‌పుట్‌సబ్సిడీ అందాలంటే కనీసం సంవత్సరం పట్టేది. ఆతర్వాత కూడా ఇచ్చిన దాఖలాలు లేవు.ఇవాళ పంట నష్టపోయిన సీజన్‌ ముగిసేలోగానే అందిస్తున్నాం అని చెప్పారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img