: ఏపీ వైద్య ఆరోగ్య శాఖ
విదేశాల నుంచి ఆంధ్రప్రదేశ్కు 30 మంది ప్రయాణికులు మిస్సయ్యారన్న వార్తలపై ఏపీ వైద్య ఆరోగ్యశాఖ స్పందించి క్లారిటీ ఇచ్చింది. శనివారం నాడు అమరావతిలో మీడియా మీట్ నిర్వహించిన ఏపీ హెల్త్ డైరెక్టర్ డాక్టర్ హైమావతి.. విదేశాల నుంచి వచ్చిన 30 మంది ప్రయాణికులు మిస్సయ్యారనే వార్తల్లో వాస్తవం లేదని స్పష్టం చేశారు. ఇలాంటి వదంతుల్ని ఎవరూ నమ్మొద్దని సూచించారు. వైజాగ్, సమీప జిల్లాలకు చెందిన 30 మంది అంతర్జాతీయ ప్రయాణికుల వివరాల్ని కేంద్రం పంపించిందని తెలిపారు.‘వందే భారత్ స్కీం కింద విజయవాడ విమానాశ్రయానికి కొన్ని విమానాలొస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వ ప్రొటోకాల్ ప్రకారం విజయవాడ విమానాశ్రయంలో వైద్య బృందాలు పరీక్షలు నిర్వహిస్తున్నాయి. రాష్ట్రంలోని అన్ని విమానాశ్రయాల్లో ఇప్పటికే వైద్య బృందాల్ని ఏర్పాట్లు చేశామన్నారు.