రాజకీయాన్ని రాజకీయంగానే ఎదుర్కోవాలని దెందలూరు మాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నాయకుడు చింతమనేని ప్రభాకర్ అన్నారు. హైదరాబాద్ శివారు పటానుచెరు మండలం చినకంజర్ల శివారులో మామిడితోటలో కోడి పందేల వ్యవహారంలో ఆయన ఉన్నట్లు వార్తలు వచ్చిన నేపథ్యంలో చింతమనేని సోషల్మీడియాలో స్పందిచారు. కోడిపందాల్లో లేని వ్యక్తిని ఉన్నట్లు చూపించడం కొందరి జెండా..అజెండా..ఇంత రాక్షస రాజకీయం అవసరమా అని ప్రశ్నించారు.
కోడి పందేల నిర్వహణలో తన పాత్ర ఉందనే దుర్మార్గ, నీచమైన ప్రచారాన్ని ఇకనైనా ఆపాలన్నారు. ఇలాంటి ప్రచారంతోనే కుప్పకూలే మేడాలు కట్టి అధికారంలోకి వచ్చారని ఆయన పేర్కొన్నారు.అసత్యాల ‘సాక్షి’ని ప్రజలు కూకటి వేళ్లతో ప్రక్షాళన చేసే సమయం వచ్చిందని పేర్కొన్నారు.