ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. గురువారం నాటికి 8వ రోజుకు చేరుకున్నాయి. శుక్రవారంతో దసరా వేడుకలు ముగియనున్నందున ఇంద్రకీలాద్రికి భక్తుల తాకిడి పెరిగింది. ఇవాళ అమ్మవారు మహిషాసుర మర్దనిదేవిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. దుర్గమ్మను దర్శించుకునేందుకు తెల్లవారుజాము నుంచే భక్తులు క్యూ కట్టారు.