దేవినేని ఉమ
సీఆర్డీఏ చట్టం అమరావతి ప్రజా రాజధానిని కాపాడిరదని మాజీ మంత్రి దేవినేని ఉమ అన్నారు. రాజధాని అమరావతి కోసం 808 రోజులుగా రాజధాని రైతులు చేసిన ఉద్యమాన్ని రాష్ట్రం మరచిపోదని అన్నారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ, స్వాతంత్య్ర ఉద్యమం తరవాత ఆ స్థాయిలో ఉద్యమం చేశారన్నారు.. రాష్ట్ర ముఖ్యమంత్రి వెంటనే డెవలప్మెంట్ చేసి అప్పగించాలని డిమాండ్ చేశారు. పక్కరాష్ట్రం నుండి తెచ్చుకున్న లాలూచీ నిధులతో అమరావతిని చంపారని మండిపడ్డారు. ఈ ముఖ్యమంత్రికి పరిపాలన చేయడం చేతకాదు…అందుకే చతికిల పడ్డారన్నారు. రైతు చట్టాలపై ప్రధాని దేశానికి క్షమాపణ చెప్పారని… ఈ సీఎం ఎందుకు చెప్పారని ప్రశ్నించారు. ఇక బిల్డ్ అమరావతి, సేవ్ ఆంధ్రప్రదేశ్ అని రైతులు ముందుకు వెళ్ళాలని అన్నారు.