వైసీపీ ప్రభుత్వం చీకటి బడ్జెట్ ప్రవేశపెట్టిందని టీడీపీ శాసనసభ పక్ష ఉపనేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. అకౌంటబిలిటీ లేకుండా చేసుకునే గోబెల్స్ ప్రచారం ఆర్ధిక ఉగ్రవాదమేనని అన్నారు. పన్నుల రూపేణా ఆదాయం పెంచుకుని కూడా సంక్షేమానికి ఖర్చు చేయకపోవడంతో రాష్ట్రం చిన్నాభిన్నమవుతోందని విమర్శించారు. గత బడ్జెట్లో దోచిందెంత, దాచిదెంతో శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. బడ్జెట్ కేటాయింపులకు ఖర్చులకు ఎక్కడా పొంతన లేదని అన్నారు.