Friday, April 19, 2024
Friday, April 19, 2024

ఇది భావితరాల భవిష్యత్‌ యాత్ర

టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు
రైతుల మహాపాదయాత్ర రాజకీయ యాత్రకాదు..భావితరాల భవిష్యత్‌ యాత్ర అని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు అన్నారు. మహాపాదయాత్రకు వస్తున్న స్పందన చూసి జగన్‌ రెడ్డికి చలిజ్వరం పట్టుకుందని ఎద్దేవా చేశారు. పోలీసులను అడ్డం పెట్టుకుని పాదయాత్రను అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. ఎన్నికల కోడ్‌ ఆపాదించి అడ్డుకోవడం న్యాయస్థానం ఆదేశాలను ధిక్కరించడమే అని ఆయన పేర్కొన్నారు. రాజధాని మార్పుపై ఇచ్చిన మాటను తప్పినందుకు జగన్‌ సహా వైసీపీ నేతలందరూ సిగ్గుతో తలదించుకోవాలన్నారు. రాజధానిపై వైసీపీ చేసిన ఆరోపణలన్నీ నిరాధారమయ్యాయని అన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img