Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

ఇదేనా మహిళలకు మీరిచ్చే భద్రత..? : నారా లోకేశ్‌

చిత్తూరు జిల్లా కురబలకోట మండలంలో మహిళ మృతిపై టీడీపీ నేత నారా లోకేశ్‌ స్పందించారు. గాజుల వ్యాపారి రమణమ్మని ఆర్థిక వ్యవహారాలలో ఏర్పడిన వివాదంతో వైసీపీ నేత ఎన్‌. వెంకట్రమణారెడ్డి అతి దారుణంగా కొట్టి చంపడం రాష్ట్రంలో వైసీపీ దండుపాళ్యం గ్యాంగ్‌ అరాచకాలకి పరాకాష్ట అని ఆయన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రాన్ని రావణకాష్టం చేయడానికి ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి, వైఎస్సార్సీపీ నేతలు కంకణం కట్టుకున్నారని అన్నారు. ప్రజలు అధికారం ఇచ్చింది.. కబ్జాలు, దోపీడీలు, అడ్డుపడిన వారిని చంపడానికి లైసెన్సు అన్నట్లు దారుణాలకు తెగబడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తూ.. ట్వీట్‌ చేశారు. ‘చిత్తూరు జిల్లా కురబలకోట మండలం కొంగావారిపల్లికి చెందిన గాజుల వ్యాపారి రమణమ్మని ఆర్థిక వ్యవహారాలలో ఏర్పడిన వివాదంతో వైసీపీ నేత ఎన్‌.వెంకట్రమణారెడ్డి అతి దారుణంగా కొట్టి చంపడం రాష్ట్రంలో వైసీపీ దండుపాళ్యం గ్యాంగ్‌ అరాచకాలకి పరాకాష్ట. జగన్‌రెడ్డి దిశ వాహనాలకి జెండా ఊపి ప్రారంభించి మహిళల భద్రతకి నాది భరోసా అని మాయమాటలు చెప్పి మూడురోజులు కాలేదు. వైసీపీకి చెందిన వెంకట్రమణారెడ్డి మహిళని అత్యంత పాశవికంగా కొట్టి చంపేశాడు..’ అని నారా లోకేశ్‌ ఆరోపించారు. ఇదేనా ముఖ్యమంత్రి మహిళలకు మీరిచ్చే భద్రత..?’ అని ఆయన ప్రశ్నించారు. అండగా నిలవాల్సిన ప్రభుత్వమే అంతమొందిస్తుంటే, న్యాయం చేయాల్సిన పోలీసులు అన్యాయంగా వ్యవహరిస్తుంటే.. రాష్ట్ర ప్రజల ప్రాణాలకి దేవుడే దిక్కు అని అన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img