: అశోక్ గజపతిరాజు
కోర్టులు తప్పుబడుతున్నా.. ప్రభుత్వం తప్పులు చేయడం మాత్రం మానడం లేదని కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు అన్నారు. సింహాచలం భూముల విషయంలో తనకు ఇప్పటి వరకు ఎలాంటి నోటీసు రాలేదని అన్నారు. అన్యాక్రాంతమైన ఆ భూముల వివరాలు, సర్వే నంబర్లు ఇంతవరకు ఎందుకు బయట పెట్టలేదని ప్రశ్నించారు. మాన్సస్ వ్యవహారం కుటుంబ తగాదా అని చెబుతున్న ప్రభుత్వ పెద్దలు చైర్మన్ నియామకానికి ఎందుకు జీవో జారీ చేసిందన్నారు.