ఈ సారి ఎన్నికల్లో ముఖ్యమంత్రి జగన్కు 17 సీట్లు కూడా రావని సీపీఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామకృష్ణ అన్నారు. 175 సీట్లు గెలువడానికి అసలు ఏ వర్గానికి మేలు చేశారో ఆయన సమాధానం చెప్పాలన్నారు. ఎమ్మెల్యేలు, మంత్రులకు అధికారాలు లేకపోగా వాళ్లను జగన్ కీలు బొమ్మల్లా మార్చాడని ఆరోపించారు. 85 శాతం కుటుంబాలకు సంక్షేమ ఫలాలు అందితే ఎమ్మెల్యేలను మారుస్తానని జగన్ ఎందుకు అంటున్నారో అర్థంకావడం లేదన్నారు. ప్రజా పోరాటాల్లో కలిసి వచ్చే వారితోనే ముందుకెళ్తామని రామకృష్ణ తెలిపారు.