Friday, April 26, 2024
Friday, April 26, 2024

ఈసారి వైసీపీ గెలవదని ఆ పార్టీ శ్రేణులే చెబుతున్నాయి : అచ్చెన్నాయుడు

కేవలం మూడంటే మూడేళ్ళలో సొంత పార్టీ కార్యకర్తలు, అభిమానులకు కూడా జగన్‌ రెడ్డి నైజం, అతని అసమర్థ పాలన గురించి అర్థమైపోయిందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరపు అచ్చెన్నాయుడు వైసీపీ ప్రభుత్వంపై ట్వీట్‌ చేశారు.జగన్‌ అసమర్థ పాలన గురించి అర్థమైపోయింది. బహిరంగంగా తమ అసంతృప్తి వెళ్లగక్కడమే కాదు, ఈసారి తమ పార్టీ గెలిచే పరిస్థితి లేనే లేదని వారే స్వయంగా చెబుతున్నారని ట్వీట్‌ చేశారు. ‘‘గత మూడేళ్లలో దళితులపై దాడులు, ఆడపిల్లలపై అత్యాచారాలు, కల్తీ మద్యం, ప్రతిపక్షాల నాయకులు, కార్యకర్తలపై దాడులు, భూ కబ్జాలు, మైనింగ్‌ మాఫియా, శ్యాండ్‌ మాఫియా, ల్యాండ్‌ మాఫియా, మట్టి మాఫియా, కోర్టు ధిక్కారాలు, చెత్త రోడ్లు, పూర్తిగా నిలిచిపోయిన అభివృద్ధి, లక్షల కోట్లలో ప్రభుత్వం విచ్చలవిడిగా చేస్తున్న అప్పులు, అధికార పార్టీ నేతల ఆగడాలు చూసి చూసి, సామాన్య ప్రజలు ఎప్పుడో డిసైడ్‌ అయిపోయారు. ఈసారి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడే సీఎం అవుతారని అన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img