ఉక్రెయిన్లో చిక్కుకుపోయిన ఏపీ విద్యార్థులను తీసుకొచ్చేందుకు టాస్క్ ఫోర్స్ కమిటీ ఏర్పాటైన సంగతి తెలిసిందే. రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి కృష్ణబాబు నేతృత్వంలో ఈ కమిటీ ఏర్పాటైంది. ఈ నేపథ్యంలో కృష్ణబాబు స్పందిస్తూ, ఉక్రెయిన్ లోని 7 యూనివర్సిటీల్లో ఏపీ విద్యార్థులు చదువుతున్నారని తెలిపారు.
ఇక ఉక్రెయిన్ లో చిక్కుకున్న 423 మంది ఏపీ విద్యార్థులు ఎక్కడెక్కడ ఉన్నదీ మ్యాపింగ్ చేశామని తెలిపారు.విద్యార్థులకు వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసి సూచనలిస్తున్నామన్నారు. 23 మంది విద్యార్థులు వస్తున్నారని కేంద్రం సమాచారమిచ్చిందన్నారు. అందులో ఏపీకి చెందిన వారు ముగ్గురే ఉన్నారని కృష్ణబాబు తెలిపారు. దిల్లీ ఎయిర్పోర్టులో హెల్ప్డెస్క్ ఏర్పాటు చేశామని తెలిపారు. సరిహద్దు ప్రాంతాలకు వెళ్లొద్దని విద్యార్థులకు సూచిస్తున్నామన్నారు. కాగా, ఉక్రెయిన్ లోని ఏపీ విద్యార్థులు తప్ప ప్రవాసాంధ్రులెవరూ తమను సంప్రదించలేదని కృష్ణబాబు పేర్కొన్నారు. ఉక్రెయిన్ లో ఏపీ వాళ్లు ఎంతమంది ఉన్నారనే వివరాలు రాబడుతున్నామని తెలిపారు. వీసా స్టాంపింగ్, ఐబీ, విదేశీ విద్యలకు విద్యార్థులను పంపే ఏజెన్సీల నుంచి సమాచారం సేకరిస్తున్నామని వెల్లడిరచారు.