గంగవరం పోర్టుపై టీడీపీ అసత్య ప్రచారం
మంత్రి బొత్స సత్యనారాయణ
రాజధానిగా విశాఖ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ను ఎందుకు వ్యతిరేకిస్తున్నారని ప్రతిపక్షాలను మంత్రి బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. విశాఖ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ను వైసీపీ ప్రకటిస్తే ప్రతిపక్ష పార్టీలు కోర్టులు కెళ్ళి స్టేలు తెచ్చుకున్నారని ఆయన ఆరోపించారు. ఏ మొహం పెట్టుకొని ప్రతిపక్ష పార్టీలు ఉత్తరాంధ్ర అభివృద్ధి పేరుతో చర్చావేదిక అంటున్నారని ఆయన ప్రశ్నించారు. శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, విశాఖ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ను ఎందుకు వ్యతిరేకిస్తున్నారని ఆయన సూటిగా ప్రశ్నించారు. విశాఖ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ని వ్యతిరేకించిన మీకు ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం మాట్లాడే హక్కు లేదన్నారు. ఉత్తరాంధ్ర అభివృద్ధికి టీడీపీ ఏం చేసిందో చెప్పగలదా? అని ప్రశ్నించారు. గంగవరం పోర్టుపై టీడీపీ అసత్యాలు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు.