ఆర్థిక శాఖ అధికారులతో మంత్రుల కమిటీ మరోసారి భేటీ అయింది. భేటీకి ముందు మంత్రి బొత్స సత్యానారాయణ మీడియాతో మాట్లాడారు.‘‘పీఆర్సీ గురించి నిన్న అర్ధరాత్రి ఒంటి గంట వరకు ఉద్యోగులతో చర్చించాం. వారి సమస్యలు, అసంతృప్తి, ఆవేదనకు పరిష్కారం చూపించాం. ఐఆర్ రికవరీ విషయంలో స్పష్టతనిచ్చాం. ఇవాళ మళ్లీ ఉద్యోగులతో సమావేశమై హెచ్ఆర్ఏ శ్లాబుల గురించి చర్చిస్తాం. దీనివల్ల ప్రభుత్వంపై రూ.6వేల కోట్ల భారం పడే అవకాశం ఉంది. మిగతా సమస్యలన్నీ చిన్నచిన్నవే ఉన్నాయి. చర్చల తర్వాత సీఎం జగన్ కు అన్ని విషయాలూ చెప్తాం’’ అని బొత్స తెలిపారు.