Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

ఉద్యోగుల బదిలీలకు ఏపీ సర్కార్ గ్రీన్ సిగ్నల్

  • ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉద్యోగుల బదిలీలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈనెల 22వతేదీ నుంచి 31వ తేదీ వరకు బదిలీలకు అవకాశం కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రెండు కేటగిరీలుగా ఉద్యోగుల బదిలీ ఉంటుందని ప్రభుత్వం తెలిపింది. రెండేళ్లు ఒకే చోట పనిచేసిన వారికి రిక్వెస్ట్ బదిలీలకు అవకాశం కల్పించింది. ఐదేళ్లు ఒకే చోట పనిచేసిన వారికి బదిలీ తప్పనిసరి చేసింది ప్రభుత్వం. టీచర్లతో పాటు ఇతర ఉద్యోగులకు విడిగా గైడ్ లైన్స్ ను ప్రభుత్వం విడుదల చేసింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img