Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

ఎన్ఐఏ ఇచ్చిన రిపోర్ట్ ఏంటి.. మీ రాతలేంటి?.. బొత్స సత్యనారాయణ

కోడికత్తి కేసులో ఎన్‌ఐఏ రిపోర్టును కొన్ని వార్తా సంస్థలు వక్రీకరిస్తున్నాయని ఏపీ విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. కోడి కత్తి దాడి జగనే చేయించుకున్నారన్న భావన కల్పిస్తున్నాయని అసహనం వ్యక్తం చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. విశాఖ ఎయిర్ పోర్టులో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిపై జరిగిన దాడి వాస్తవమని అన్నారు. జగన్‌ పై ఎయిర్ పోర్ట్‌లో జరిగిన ఘటనపై సమగ్ర విచారణ జరపాలన్నదే తమ డిమాండ్ అని బొత్స అన్నారు. కోడికత్తి దాడికి పాల్పడిన శ్రీనివాస్ ఏ ఉద్దేశ్యంతో చేశాడో తెలియాలన్నారు. ఎన్‌ఐఏ రిపోర్ట్‌లో ఏముందో ఎలా తెలిసిందని మంత్రి బొత్స ప్రశ్నించారు. ాఎన్ఐఏ ఇచ్చిన రిపోర్ట్ ఏంటి..? మీరు రాసిన రాతలేంటి? జగన్ తన రాజకీయ స్వలాభం కోసమే దాడి చేయించుకున్నాడని ఉందా? ఎన్ఐఏ వచ్చి చెప్పిందా మీకు?్ణ్ణ అని నిప్పులు చెరిగారు. అలిపిరిలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై నక్సల్స్ దాడి చేశారని.. అది కూడా రాజకీయ లబ్ధి కోసం బాబు చేయించుకున్నారా? అని నిలదీశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img