Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

ఎన్నికల కోడ్ నేపథ్యంలో లోకేశ్ పాదయాత్రకు బ్రేక్

మదనపల్లి నియోజవర్గంలో లోకేశ్ పాదయాత్ర
కంటేవారిపల్లిలో బస
ఎన్నికల కోడ్ అమల్లో ఉందన్న పోలీసులు
బస నుంచి వెళుతున్న లోకేశ్

ఏపీలో ఎల్లుండి (మార్చి 13) ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, ఎన్నికల కోడ్ ను గౌరవిస్తూ నారా లోకేశ్ యువగళం పాదయాత్రకు విరామం ప్రకటించారు. మదనపల్లి నియోజకవర్గంలోని కంటేవారిపల్లి బస ప్రాంతం నుంచి వెళ్లిపోయేందుకు లోకేశ్ సిద్ధమయ్యారు.పోలీసుల విజ్ఞప్తితో లోకేశ్ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికల కోడ్ ముగిసిన అనంతరం కంటేవారిపల్లి నుంచి పాదయాత్ర తిరిగి ప్రారంభించనున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ముగిసిన తర్వాతే లోకేశ్ ఈ ప్రాంతానికి రానున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img