తెనాలిలో అన్న క్యాంటిన్ను పోలీసులు, అధికారులు అడ్డుకోవడంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ మండిపడ్డారు. అన్నం తినే వారెవ్వరూ అన్నా క్యాంటీన్ను అడ్డుకోరని ఆయన ఘాటు వ్యాఖ్య చేశారు. ఇప్పటికే నందిగామ, మంగళగిరి, కుప్పంలలో తమ పార్టీ ఏర్పాటు చేయతలపెట్టిన అన్నా క్యాంటీన్లను అడ్డుకున్నారని ఆయన మండిపడ్డారు. తాజాగా తెనాలిలోనూ అన్నా క్యాంటీన్ను అడ్డుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి అసలు మానవత్వమే లేదా? అని కూడా నారా లోకేశ్ ప్రశ్నించారు. తెనాలిలో కేవలం అన్నా క్యాంటీన్ను అడ్డుకునేందుకే పోలీసు పహారా పెట్టడం దారుణమని ఆయన అభిప్రాయపడ్డారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా అన్నా క్యాంటీన్లను నిర్వహించి తీరతామని ఆయన స్పష్టం చేశారు. అన్నా క్యాంటీన్లతో రాష్ట్రంలోని నిరుపేదల ఆకలి తీరుస్తామని కూడా ఆయన చెప్పారు.