Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

ఎమ్మెల్సీ ఎన్నికలలో అక్రమాలకు పాల్పడుతున్న ప్రభుత్వం

వైసిపి అభ్యర్థులను ఓడించండి

సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ

రాష్ట్రంలో ఉద్యోగ, ఉపాధ్యాయ, ప్రజా వ్యతిరేక పాలన కొనసాగిస్తున్న సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎమ్మెల్సీ ఎన్నికలలో ఓడిపోతామని తెలిసి పెద్ద ఎత్తున అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్నారని సిపిఐ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ అన్నారు. పశ్చిమ రాయలసీమ పట్టుబద్రులు మరియు ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎన్నికలలో పిడిఎఫ్ అభ్యర్థులను గెలిపించి, వైసిపి అభ్యర్థులను ఓడించాలని కోరుతూ ప్రచారాన్ని నిర్వహిస్తూ శనివారం ఉరవకొండకు వచ్చారు. ఈ సందర్భంగా స్థానిక సిపిఐ పార్టీ కార్యాలయంలో పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డి.జగదీష్ తో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికార మదంతో వ్యవహరిస్తున్నారని ప్రతి ఎన్నికల్లోను తామే గెలవాలని ప్రతిపక్ష పార్టీలు ఉండకూడదని నియంతలా పనిచేస్తున్నారని ఆరోపించారు. గతంలో ఏ ముఖ్యమంత్రి కూడా పట్టభద్రులు మరియు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలలో జోక్యం చేసుకునే వారు కాదని ప్రస్తుత ముఖ్యమంత్రి అన్ని స్థానాలు తామే గెలవాలని విచ్చలవిడిగా అధికార దుర్వినియోగం, దొంగ ఓట్లు నమోదు తో పాటు ఓట్లు కొనుగోలుకు కోట్లాది రూపాయలు ఖర్చు పెడుతున్నారని ఆరోపించారు. మద్యంలో సంపాదించిన డబ్బును ఓట్లు కొనుగోలుకు ఖర్చు పెడుతున్నారని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రాష్ట్ర అభివృద్ధిని గాలికి వదిలేసారని 31 మంది ఎంపీలు ఉన్నప్పటికీ రాష్ట్రానికి రావలసిన ప్రత్యేక హోదా, విభజన హామీలను సాధించడంలో పూర్తిగా విఫలం చెందారన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ కను సన్నల్లో సీఎం పనిచేస్తున్నారని పేర్కొన్నారు ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న ఈ ప్రభుత్వానికి ఎమ్మెల్సీ ఎన్నికలలో మేధావులు ఉద్యోగులు, ఉపాధ్యాయులు పట్టుభద్రులు తగిన గుణపాఠం చెప్పాలన్నారు ప్రజాస్వామ్యానికి పాతరేసే విధానాలను అవలంబిస్తున్న ఈ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పడానికి రాష్ట్రంలోని అన్ని పార్టీలు కూడా ఒకే వేదిక పైకి రానున్నట్లు ఆయన తెలిపారు ఎమ్మెల్సీ ఎన్నికల రోజు దొంగ ఓట్లు వేసేందుకు వచ్చే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఎన్నికలను నిష్పక్షపాతంగా జరపాలని ఆయన ఎన్నికల కమిషన్ ను కోరారు, పశ్చిమ రాయలసీమ ఎమ్మెల్సీ ఉపాధ్యాయ అభ్యర్థి కత్తి నరసింహారెడ్డికీ పట్టభద్రుల ఎమ్మెల్సీ పోతుల నాగరాజుకు మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలన్నారు. అలాగే తెలుగుదేశం పార్టీ బలపరుస్తున్న భూమి రెడ్డి రాంగోపాల్ రెడ్డి కీ రెండవ ప్రాధాన్యత ఓటు వేయాలన్నారు ఈ విలేకరుల సమావేశంలో పార్టీ జిల్లా కార్యదర్శి సి.జాఫర్, సహాయ కార్యదర్శులు నారాయణస్వామి, మల్లికార్జున, జిల్లా కార్యవర్గ సభ్యులు కేశవరెడ్డి, ఉరవకొండ తాలూకా కార్యదర్శి జే మల్లికార్జున, సహాయ కార్యదర్శి మనోహర్, ఏఐటీయూసీ నాయకులు చెన్నారాయుడు, పార్టీ సీనియర్ నాయకులు శివన్న, శ్రీధర్, వజ్రకరూరు కార్యదర్శి సుల్తాన్, విడపనకల్లు కార్యదర్శి రమేష్, పార్టీ నాయకులు సంగప్ప, ఉరవకొండ కార్యదర్శి తలారి మల్లికార్జున, కూడేరు మండల కార్యదర్శి నారాయణమ్మ, మరియు మహిళా,విద్యార్థి ప్రజానాట్యమండలి సంఘం సభ్యులు పాల్గొన్నారు

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img