బీజేపీ ఎంపీ సీఎం రమేష్
అసెంబ్లీ వేదికగా ప్రతిపక్ష నేత కుటుంబ సభ్యుల గురించి మాట్లాడటం దురదృష్టకరమని..మనస్సాక్షి ప్రకారం నడుచుకోవాలని బీజేపీ ఎంపీ సీఎం రమేష్ అన్నారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ, ఏపీ అసెంబ్లీలో వ్యక్తిగత ఆరోపణలు చేయడం దురదృష్టకరమని అన్నారు. ఆంధ్రప్రదేశ్ గురించి దేశమంతా సిగ్గుగా మాట్లాడుకుంటున్నారని అన్నారు. చంద్రబాబు కుటుంబ సభ్యుల గురించి ఎవరేమి మాట్లాడారో అందరికీ తెలుసని, ప్రజలంతా గమనిస్తున్నారని అన్నారు. మరోవైపు ఏపీని వరదలు ముంచెత్తినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. అధికారులను అప్రమత్తం చేసే ప్రజాప్రతినిధులు లేరని తెలిపారు. ప్రజలను పట్టించుకోకుండా జగన్ ప్రభుత్వం వికృత రాజకీయ క్రీడలకు దిగుతోందని మండిపడ్డారు.