ఇకపై ఏడాదికి రెండుసార్లు వైయస్ఆర్ ‘లా నేస్తం’ అమలు చేస్తామని ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రకటించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో బుధవారం వైయస్ఆర్ లా నేస్తం పథకం ద్వారా నిధులను సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి విడుదల చేశారు. జూనియర్ న్యాయవాదుల ఖాతాల్లో కోటి 55 వేలు సీఎం వైయస్ జగన్ జమ చేశారు. ఈ సందర్భంగా వర్చువల్గా సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి జూనియర్ లాయర్లతో మాట్లాడారు. లాయర్లకు ప్రభుత్వం తోడుగా ఉందని తెలిపేందుకే వైయస్ఆర్ లా నేస్తం పథకాన్ని అమలు చేస్తున్నామని చెప్పారు.