Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

ఏపీఎస్‌ఆర్టీసీలో కారుణ్య నియామకాలు: పేర్ని నాని

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఏపీఎస్‌ ఆర్టీసీ)లో కొత్తగా కారుణ్య నియామకాలు చేస్తున్నామని మంత్రి పేర్ని నాని తెలిపారు. బుధవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ, మొత్తంగా 1800లకు పైగా కారుణ్య నియామకాలు గ్రామ, వార్డు సచివాలయాలతో పాటు మిగిలిన శాఖల్లో ఉద్యోగాలు ఇవ్వాలని సీఎం ఆదేశాలు ఇచ్చారన్నారు. ఆయిల్‌ కంపెనీల నుంచి నెలకు 8 లక్షల లీటర్లు ఆయిల్‌ వాడుతున్నామని, ఆర్టీసీ కేంద్రం నుంచి కొనే ఆయిల్‌లో ధరల తేడాలో మార్పులు వచ్చాయన్నారు. గతంలో 15 రూపాయలు తేడా ఉండేదని, ఇప్పుడు బయట, బంకుల్లోనే తక్కువ ధరకు దోరుకుతోందన్నారు. దీనితో బయట బంకుల్లో కొనాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుని కొంటోందన్నారు. తద్వారా కోటి 50 లక్షల రూపాయలు ఇప్పటివరకు మేలు జరిగిందన్నారు. కేంద్రం ప్రభుత్వం నుంచి కాక బయట కొనడం వల్ల నెలకు రూ. 33.83 కోట్ల మేలు చేకూరుతుందన్నారు. ఎలక్ట్రిక్‌ బస్సులకు టెండర్ల ప్రక్రియ పూర్తయిందని తెలిపారు. త్వరలోనే 40 బస్సులు అందుబాటులోకి వస్తాయని, మిగతావి మరికొన్ని వారాల్లోనే అందుతాయని చెప్పారు. తిరుమల-తిరుపతికి యాభై బస్సులు నడుపుతామని, 60 సంవత్సరాల పైబడిన ప్రయాణికులకు రాయితీలు ఏప్రిల్‌ నాలుగు నుంచి అమలు చేస్తామని చెప్పారు. గతంలో కరోనా వలన వాటిని నిలిపేశామని, తాజాగా ఇప్పుడు మళ్లీ పునరుద్దరిస్తున్నామని తెలిపారు.ఆర్టీసీని ప్రభుత్వంలోకి తీసుకోవటం వల్ల మూడు వేల కోట్ల పైబడి భారం పడుతోందని గుర్తు చేశారు. అయినాసరే ఉద్యోగుల భవిష్యత్తు దృష్ట్యా ఇలాంటి నిర్ణయం తీసుకున్నాని మంత్రి పేర్ని నాని తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img