కరోనా నియంత్రణ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరో 7.20 లక్షల కొవిడ్ టీకా డోసులు చేరుకున్నాయి.కోవిషీల్డ్ డోసులు పుణె నుంచి గన్నవరం ఎయిర్పోర్టుకు చేరుకున్నాయి. అక్కడి నుంచి టీకా డోసులను గన్నవరంలోని టీకా నిల్వ కేంద్రానికి తరలించనున్నారు. జాబితాల ప్రకారం టీకా నిల్వ కేంద్రం నుంచి వీటిని జిల్లాలకు అధికారులు తరలిస్తారు.