Thursday, April 18, 2024
Thursday, April 18, 2024

ఏపీపీఎస్సీ ఛైర్మన్‌గా గౌతమ్‌ సవాంగ్‌

ఏపీపీఎస్సీ ఛైర్మన్‌గా గౌతమ్‌ సవాంగ్‌ను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. రెండు రోజుల క్రితం డీజీపీగా కొనసాగిన ఆయన్ను బదిలీ చేసి జీఏడీలో రిపోర్టు చేయాలని ఆదేశించిన ప్రభుత్వం..తాజాగా ఏపీపీఎస్సీ ఛైర్మన్‌గా నియమించింది. కొద్దిసేపట్లో దీనికి సంబంధించిన అధికారిక ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది. గౌతమ్‌ సవాంగ్‌..ఆంధ్రప్రదేశ్‌ డీజీపీగా పనిచేసిన గౌతమ్‌ సవాంగ్‌ను జగన్‌ సర్కార్‌ అవమానకర రీతిలో సాగనంపిదని తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్న విషయం తెలిసిందే. అయితే ఇవాళ ఆయనకు ఏపీ ప్రభుత్వం పదవిని ఫిక్స్‌ చేసింది.ఏపీపీఎస్సీ చైర్మన్‌గా ఉన్న ఉదయభాస్కర్‌ పదవీకాలం ఆరునెలల క్రితం పూర్తయింది. అప్పటినుంచి పదవి ఖాళీగా ఉంది. ఈ నేపథ్యంలో ఇటీవలే డీజీపీ పోస్టు నుంచి బదిలీ చేసిన సవాంగ్‌ను ఏపీపీఎస్సీ చైర్మన్‌గా నియమించాలని ప్రభుంత్వం నిర్ణయించింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img