ఏపీలో పాఠశాలలకు ఈ నెల 4 నుంచి ఒంటిపూట తరగతులు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలో సాధారణంగా కంటే ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదువుతున్నాయి. వేసవి తీవ్రతను దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు రాష్ట్ర విద్యాశాఖమంత్రి ఆదిమూలపు సురేశ్ తెలిపారు. ఉదయం 7.30 గంటల నుంచి 11.30 గంటల వరకు తరగతులు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఒంటిపూట బడులపై ఇప్పటికే అన్ని జిల్లాల విద్యాశాఖ అధికారులకు ఆదేశాలు జారీచేశారు.