Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

ఏపీలో కాస్త తగ్గిన కరోనా కేసులు..

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు కాస్త తగ్గుముఖంపట్టాయి. గడిచిన 24 గంటల్లో 38,746 కోవిడ్‌ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 864 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం ఇప్పటివరకు 20,30,849 కేసులు నమోదయ్యాయి.కరోనా మహమ్మారి బారినపడి గడిచిన 24 గంటల్లో 12 మంది బాధితులు ప్రాణాలు కోల్పోయారు. దీంతో వైరస్‌ బారినపడి మరణించిన వారి సంఖ్య 14,010కి చేరింది. ఒక్కరోజు వ్యవధిలో 1,310 మంది బాధితులు కోలుకోగా, రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు 20,02,187 మంది పూర్తిగా కోలుకుని డిశ్చార్జ్‌ అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో 4,652 యాక్టివ్‌ కేసులున్నాయి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img