ఆంధ్రప్రదేశ్లో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది.గడిచిన 24 గంటల్లో 61678 పరీక్షలు నిర్వహించగా 1,217 మందికి కరోనా పాజిటివ్గా నిర్ధారణయ్యింది. తాజా కేసులతో మొత్తం కేసుల సంఖ్య 2001255కి చేరింది. కరోనా బారినపడి కొత్తగా మరో 13 మంది ప్రాణాలు విడిచారు. దీంతో రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య 13715కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 15141 యాక్టివ్ కేసులున్నాయి. కొత్తగా 24 గంటల వ్యవధిలో 1535 మంది వ్యాధి బారి నుంచి కోలుకున్నారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా రికవరీల సంఖ్య 1972399కి చేరింది.