ఏపీలో గడిచిన 24 గంటల్లో 127 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా బారినపడి తాజాగా ముగ్గురు మృతి చెందారు. తాజా కేసులతో ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం 20,75,546 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనాతో రాష్ట్రంలో 14,477 మరణాలు సంభవించాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 1,758 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. కరోనా నుంచి 20,59,313 మంది రికవరీ చెందారు.