ఆంధ్రప్రదేశ్లో గడిచిన 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్లో 64,461 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 1,321 మందికి కరోనా పాజిటివ్గా నిర్థారణ అయ్యింది.ఈ మేరకు ఏపీ వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులెటిన్లో పేర్కొంది. తాజా కేసులతో రాష్ట్ర వ్యాప్తంగా పాజిటివ్ కేసుల సంఖ్య 20,10,566కి చేరింది.గడిచిన 24 గంటల్లో 1,499 మంది కోవిడ్ నుంచి కోలుకుని క్షేమంగా డిశ్చార్జ్ అవ్వగా, ఇప్పటివరకు 19 లక్షల 81 వేల 906 మంది డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య 14,853గా ఉంది. ఇక కరోనా బారినపడి ఏపీలో గత 24గంటల్లో 19 మంది ప్రాణాలను కోల్పోయారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం మరణాల సంఖ్య 13,807కి చేరింది. మరోవైపు, ఇప్పటివరకు రాష్ట్రంలో 2,64,71,272 శాంపిల్స్ పరీక్షించినట్లు వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది.