ఆంధ్రప్రదేశ్లో కరోనా విజృంభన కొనసాగుతూనే ఉంది. రాష్ట్రవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 1,178 కోవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 1,367 కొత్త కేసులు నమోదయ్యాయి. తాజా కేసులతో మొత్తం ఇప్పటివరకు 20,34,786 కేసలు నమోదయ్యాయని ఏపీ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడిరచింది. మహమ్మారి బారినపడి గడిచిన 24 గంటల్లో 14 మంది బాధితులు ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా మృతుల సంఖ్య 14,044కి చేరింది. ఇక గడిచిన 24 గంటల్లో 1,248 మంది బాధితులు కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు 20,06,034 మంది కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 14,708 యాక్టివ్ కేసులున్నాయి.