గడిచిన 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్లో 31,065 మందికి కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా, కొత్తగా 138 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్ విడుదల చేసింది. కరోనా బారినపడి నిన్న ఒకరు మరణించారు. కరోనా మహమ్మారి నుంచి నిన్న 118 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 2,157 యాక్టివ్ కేసులు ఉన్నాయని వైద్యారోగ్యశాఖ తెలిపింది.