ఆంధ్రప్రదేశ్లో గడిచిన 24 గంటల్లో 67,590 కరోనా పరీక్షలు నిర్వహించగా, 1,539 మందికి పాజిటివ్గా నిర్థారణ అయ్యింది. తాజా కేసులతో కలిపి ఇప్పటివరకు రాష్ట్రంలో 20,07,730కి చేరింది. గడచిన 24 గంటల్లో 1,140 మంది కరోనా నుంచి కోలుకుని క్షేమంగా డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటివరకు 19,79,504 మంది డిశ్చార్జ్ అయ్యారు.గత 24 గంటల్లో కరోనా బారినపడి 12 మంది మరణించారు. దీంతో ఇప్పటివరకు 13,778 మంది మృతి చెందారు. ప్రస్తుతం రాష్ట్రంలో 14448 యాక్టివ్ కేసులు ఉన్నాయి.