ఆంధ్రప్రదేశ్లో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 163 కరోనా కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో కరోనా బారినపడి ముగ్గురు మృతి చెందారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 20,75,271కి కరోనా కేసులు చేరగా, కరోనా వైరస్తో 14,471 మంది మరణించారు. ప్రస్తుతం ఏపీలో 1,821 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 20,58,979 మంది రికవరీ అయ్యారు. నెల్లూరు, శ్రీకాకుళం, విశాఖ జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మృతి చెందారు.