Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

ఏపీలో కొత్తగా 1,859 కరోనా కేసులు


ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్‌ వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 70,757 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా, కొత్తగా 1,859 కరోనా కేసులు నమోదయ్యాయి. తాజాగా 1,575 మంది కరోనా బాధితులు కోలుకుని డిశ్చార్జ్‌ అయ్యారు. కాగా ఇప్పటి వరకు రాష్ట్రంలో 19,56,627 మంది కరోనా బాధితులు కోలుకున్నారు. గత 24 గంటల్లో రాష్ట్రంలో కరోనా బారినపడి 13 మంది మృతి చెందారు. ఇప్పటివరకు మొత్తం 13,595 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం రాష్ట్రంలో 18,688 పాజిటివ్‌ కేసులు ఉన్నాయి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img