Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

ఏపీలో కొత్తగా 1,869 కరోనా కేసులు

ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో 71,030 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 1,869 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో ఇప్పటివరకు మొత్తం పాజిటివ్‌ కేసులు సంఖ్య 19,87,051కు చేరింది. కరోనాబారినపడి 24 గంటల్లో కరోనాతో 18 మంది మృతి చెందారు. దీంతో మొత్తం మరణాలు 13,582కు చేరాయి. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 18,417 యాక్టివ్‌ కేసులున్నాయి. గత 24 గంటల్లో 2,316 మంది కోవిడ్‌ నుంచి కోలుకుని క్షేమంగా డిశ్చార్జ్‌ అవ్వగా, ఇప్పటివరకు 19,55,052 మంది ఏపీలో డిశ్చార్జ్‌ అయ్యారు.ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ బుధవారం కరోనాపై హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img