ఏపీలో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 1,891 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ బులిటిన్ విడుదల చేసింది. కరోనా బారినపడి నిన్న అనంతపురంలో ఇద్దరు, చిత్తూరు, గుంటూరు, నెల్లూరు జిల్లాలో ఒకరు చొప్పున మరణించారు. కరోనా బారి నుంచి నిన్న 10,241 మంది కోలుకున్నారు.