ఆంధ్రప్రదేశ్లో కరోనా ఉధృతి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 81,505 శాంపిల్స్ని పరీక్షించగా 2,209 కేసులు నమోదయ్యాయి. తాజా కేసులతో మొత్తం కేసుల సంఖ్య 19,75,455కు చేరింది. మరో 22 మంది వైరస్ కారణంగా మృతిచెందారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 13,490కు చేరింది. కొత్తగా 24 గంటల వ్యవధిలో 1,896మంది వైరస్ బారి నుంచి కోలుకున్నారు. ఫలితంగా రాష్ట్రంలో మొత్తం రికవరీల సంఖ్య 19,41,372కి చేరింది. కరోనాతో ప్రస్తుతం20,593 మంది బాధపడుతున్నారు.