ఆంధ్రప్రదేశ్లో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. గడచిన 24 గంటల వ్యవధిలో రాష్ట్రవ్యాప్తంగా 86,280 కరోనా పరీక్షలు నిర్వహించగా.. 2,527 మందికి కరోనా పాజిటివ్గా నిర్థారణయ్యాయి. తాజా కేసులతో కలిపి ఇప్పటివరకు రాష్ట్రంలో 19,46,749 మంది వైరస్ బారినపడినట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ బుధవారం రిలీజ్ చేసిన బులిటెన్లో తెలిపింది. గడచిన 24 గంటల్లో కరోనాతో మరో 19 మంది ప్రాణాలు కోల్పోయారు. చిత్తూరు 4, కృష్ణా, నెల్లూరు జిల్లాల్లో ముగ్గురు చొప్పున మృతి చెందారు. ప్రకాశం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఇద్దరు చొప్పున మృతి చెందారు. కడప, శ్రీకాకుళం, విశాఖ జిల్లాల్లో ఒక్కరు చొప్పున ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలో మొత్తం మృతుల సంఖ్య 13,197కి చేరినట్లు వెల్లడిరచింది.24 గంటల వ్యవధిలో 2,412 మంది బాధితులు వ్యాధి బారి నుంచి కోలుకున్నారు. దీంతో రాష్ట్రంలో మొత్తం రికవరీల సంఖ్య 19,09,613కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 23,939 యాక్టివ్ కేసులున్నాయి.