ఆంధ్రప్రదేశ్లో గడిచిన 24 గంటల్లో 396 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనాతో మరో ఆరుగురు మృతి చెందారు. తాజా కేసులతో ఇప్పటివరకు ఏపీలో మొత్తం 20,63,177 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా బారినపడి మొత్తం 14,339 మంది మరణించారు. ఏపీలో 5,222 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. కరోనా నుంచి 20,43,616 మంది కోలుకున్నారు.