ఆంధ్రప్రదేశ్లో గడిచిన 24 గంటల్లో 415 కరోనా కేసులు నమోదు అయ్యాయి. కరోనా బారినపడి మరో ఆరుగురు మృతి చెందారు. తాజా కేసులతో రాష్ట్రంలో మొత్తం ఇప్పటివరకు 20,64,287కు కరోనా కేసులు చేరాయి. ఇప్పటివరకు వైరస్ బారినపడి 14,356 మంది కరోనాతో చనిపోయారు. ప్రస్తుతం ఏపీలో 4,655 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కరోనా 20,45,276 మంది కోలుకున్నారు. కరోనాతో గుంటూరు, కృష్ణా, పశ్చిమ గోదావరి, జిల్లాల్లో ఇద్దరు చొప్పున మృతి చెందారు.