ఆంధ్రప్రదేశ్లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతున్నాయి. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 517 పాజిటివ్ కేసులు నిర్ధారణయ్యాయి. తాజా కేసులతో ఇప్పటివరకు మొత్తం 20,58,582 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా వైరస్ బారినపడి గడిచిన 24 గంటల్లో 8 మంది మృతి చెందారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా మృతిచెందిన వారి సంఖ్య 14,276 కి చేరింది. రాష్ట్రంలో 6,615 కరోనా యాక్టివ్ కేసులు ఉండగా, 20,37,691 మంది రికవరీ అయ్యారు.