ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతోంది. గడిచిన 24 గంటల్లో 24,663 నమూనాలు పరీక్షించగా, కొత్తగా 675 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా బారినపడి నిన్న చిత్తూరు, విశాఖపట్నం, కృష్ణా జిల్లాలో ఒక్కొక్కరు చొప్పున మరణించారు. కరోనా నుంచి నిన్న 2,414 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 10,808 యాక్టివ్ కేసులు ఉన్నాయి.