ఆంధ్రప్రదేశ్లో కరోనా విజృంభణ కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 42,679 శాంపిల్స్ టెస్ట్ చేయగా 839 మందికి వైరస్ సోకినట్లు తేలింది.దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2039529కి చేరింది.మహమ్మారి బారినపడి 8 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 14078కి చేరింది. ఇక గడిచిన 24 గంటల్లో 1,142 మంది వైరస్ బారి నుంచి కోలుకున్నారు. దీంతో రాష్ట్రంలో మొత్తం రికవరీల సంఖ్య 2011063కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 14388 యాక్టివ్ కేసులున్నాయి.