Tuesday, April 23, 2024
Tuesday, April 23, 2024

ఏపీలో కొత్తగా 909 కరోనా కేసులు

ఏపీలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 46962 కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా 909 మందికి వైరస్‌ సోకినట్లు నిర్థారణయ్యింది. దీంతో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 19,94,606కు చేరింది. వైరస్‌ బారినపడి తాజాగా 13 మంది ప్రాణాలు విడిచారు.దీంతో రాష్ట్రంలో మొత్తం మృతుల సంఖ్య 13660 కి చేరింది. కొత్తగా 24 గంటల వ్యవవధిలో 1543 మంది వ్యాధి నుంచి కోలుకున్నారు. దీంతో రాష్ట్రంలో మొత్తం రికవరీల సంఖ్య 1963728కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 17218 కరోనా యాక్టివ్‌ కేసులున్నాయి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img