ఏపలో టెన్త్, ఇంటర్ పరీక్షల షెడ్యూల్ గురువారం విడుదలైంది. మే 2 నుంచి మే 13 వరకు టెన్త్, ఏప్రిల్ 8 నుంచి 28 వరకు ఇంటర్ పరీక్షలు నిర్వహించనున్నట్లు రాష్ట్ర విద్యాశాఖ ప్రకటించింది. 6,39,888 మంది విద్యార్థులు టెన్త్ పరీక్షలు రాయనుండగా, ఇంటర్ పరీక్షలను 9,86,833 మంది విద్యార్థులు రాయనున్నారు. ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:45 గంటల వరకు టెన్త్ పరీక్షలు జరుగనున్నాయి. అలాగే ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఇంటర్ పరీక్షలను నిర్వహించనున్నారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ పరీక్షల నిర్వహణ ఉంటుందని మంత్రి సురేష్ తెలిపారు.