ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో పలువురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. స్టేట్ టాక్స్ చీఫ్ కమిషనర్గా గిరిజా శంకర్, పౌరసరఫరాల శాఖ స్పెషల్ సెక్రెటరీ, కమిషనర్గా హెచ్ అరుణ్ కుమార్, జీఏడీ సెక్రెటరీగా పోల భాస్కర్కు అదనపు బాధ్యతలు అప్పగించారు.