ఆంధ్రప్రదేశ్లో కరోనా కేసులు భారీగా నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 47,884 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా..4,348 మందికి పాజిటివ్గా నిర్ధారణ అయింది. కొవిడ్ బారినపడి నిన్న కృష్ణా జిల్లాలో ఒకరు, శ్రీకాకుళం జిల్లాలో ఒకరు మరణించారు. తాజాగా నమోదైన గణాంకాల ప్రకారం.. ఇప్పటివరకు రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 20,89,332కి చేరగా.. ఈ మహమ్మారితో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 14,507గా ఉంది. కాగా.. గత 24 గంటల్లో 261 మంది ఈ మహమ్మారి నుంచి కోలుకున్నారు. వీరితో కలిపి కోలుకున్న వారి సంఖ్య 20,60,621 కి చేరింది. ప్రస్తుతం ఏపీలో 14,204 యాక్టివ్ కేసులున్నాయి. ఈ మేరకు ఆరోగ్య శాఖ గురువారం సాయంత్రం హెల్త్ బులెటిన్ను విడుదల చేసింది.